PRINT TIME: April 11, 2026 11:02 AM
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు
January 20, 2026 09:57 PM
116 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్
తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో సైబర్ నేరాలు మరియు సైబర్ మోసాల నివారణ పై సీఐ కే గిరిబాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు..ఎస్సైలు వై వి శతకర్ణి కె రాజు ఎ వి కృష్ణారెడ్డి లు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు..
ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు ఫేక్ కాల్స్ ఫిషింగ్ లింకులు ఓటీపీ మోసాలు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన జాగ్రత్తలు తదితర అంశాల పైన అవగాహన కల్పించారు.సైబర్ నేరాలకు గురైన వెంటనే ఒక గంట సమయము లోపు 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు..
అనుమానాస్పద కాల్స్ లింకులు లేదా సందేశాలను నమ్మవద్దని వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి