Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్ రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 09:34 PM

సైబర్ మోసాలకు అప్రమత్తంగా ఉండాలి.. విద్యార్థులకు సూచనలు

సైబర్ మోసాలకు అప్రమత్తంగా ఉండాలి.. విద్యార్థులకు సూచనలు

సైబర్ మోసాలకు అప్రమత్తంగా ఉండాలి.. విద్యార్థులకు సూచనలు
April 28, 2026 07:38 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మామిడిపల్లి అగ్రికల్చర్ కాలేజీలలో అంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా మరియు బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జ్ సీహెచ్ ప్రసాద్ రావు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, కార్మికుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, అవయవాల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడులు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలపై విద్యార్థులకు వివరించారు. అలాగే సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, మోసపూరిత లింకులు వంటి సైబర్ నేరాల నుండి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర సేవల కోసం పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, మహిళల హెల్ప్‌లైన్ 1091 / 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల యాజమాన్యం, ఏహెచ్‌టీయూ ఎస్ఐ ఎం.డి లాల్ అహ్మద్, మాణిక్ రెడ్డి, పోలీసు సిబ్బంది మరియు సుమారు 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News