Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:56 PM

సాధారణ ప్లాట్‌ఫాంపై నిలిచిన అసాధారణ ఋషి: పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద్

సాధారణ ప్లాట్‌ఫాంపై నిలిచిన అసాధారణ ఋషి: పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద్

సాధారణ ప్లాట్‌ఫాంపై నిలిచిన అసాధారణ ఋషి: పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద్
February 07, 2026 05:07 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

సాధారణ ప్లాట్‌ఫాంపై నిలిచిన అసాధారణ ఋషి: పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద్

ప్రయాగ్‌రాజ్రైల్వే స్టేషన్‌లో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్లాట్‌ఫాంపై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తున్న ఆయన, వాస్తవానికి పూరీ గోవర్ధన పీఠాధిపతి, శంకరాచార్య స్వామి నిశ్చలానంద్ సరస్వతి. సాదాసీదా వస్త్రాలు, నిస్సంగ జీవన శైలి ఆయనను ఒక సాధారణ వ్యక్తిలా కనిపించేలా చేస్తున్నా, ఆయన మేధస్సు, ఆధ్యాత్మిక లోతు, శాస్త్రీయ ఆలోచన ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాయి. వేదాంత జ్ఞానాన్నిఆధునిక శాస్త్రంతో అనుసంధానిస్తూ, భారత ఋషి సంప్రదాయం మహత్తును ఆయన తన జీవితంతో నిరూపిస్తున్నారు. స్వామినిశ్చలానంద్ గణితశాస్త్రం, ముఖ్యంగా వేదగణితంపై లోతైన పట్టు కలిగిన పండితులలో ప్రముఖులు. వేదగణిత సూత్రాలను వినియోగించి సంక్లిష్ట గణనలనుసులభతరం చేసే ఆయన అభ్యాసం కారణంగా, దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు ఆయన సలహాలు కోరుకొంటున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగం, ఆర్థిక విశ్లేషణలు, సంక్లిష్ట మోడలింగ్ వంటి అంశాల్లో ఆయన సూచనలు కొందరు శాస్త్ర, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ఈ గౌరవాలు, ప్రశంసల మధ్య కూడా ఆయన జీవితం పూర్తిగా తపస్సు, నిశ్శబ్ద సేవ, ఆత్మపరిశీలనలతో నిండి ఉంది.

ఆయనరచించిన అనేక గ్రంథాలు వేదాంత తత్త్వం, గణిత తర్కం, ధర్మం-సామాజిక జీవన సంబంధాన్ని సులభ భాషలో వివరిస్తాయి. గోవర్ధన మఠం ద్వారా, యువతలో ఆధ్యాత్మిక చైతన్యంతో కూడిన శాస్త్రీయ దృక్కోణాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కీర్తి, ప్రచారం, వ్యక్తిగత లాభం వీటిలో ఏదీ ఆయన లక్ష్యం కాదు; మానవ జీవితాన్ని అంతర్లీన ఆనందం, ధర్మసంస్కృతితో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఆయన సాధన. ఇలాంటి ఋషులను ఇచ్చిన సంప్రదాయం మన హిందూ భారతదేశఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News