Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లారీని ఢీకొట్టిన ఎర్టిగా కార్: సూర్యాపేట యువకుడు దుర్మరణం! కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 07:50 PM

సదాశివపేటలో ఘనంగా శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవాలు

సదాశివపేటలో ఘనంగా శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవాలు

సదాశివపేటలో ఘనంగా శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవాలు
May 27, 2026 06:54 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు మందిరంలో మే 31వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మందిర భక్త బృందం తెలిపింది. సర్వతోముఖి మహాయోగి సద్గురు బాలమార్తాండ మహారాజ్ దివ్య మార్గదర్శకత్వంలో జరిగే ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలకు సంబంధించిన కరపత్రికను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజుకు అందజేసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఉత్సవాలలో భాగంగా మే 31 ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీమద్భాగవత పురాణ గ్రంథం, భక్త సురేష్ ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్ర నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం పూజా కార్యక్రమాలు, శ్రీమద్భగవద్గీత పారాయణం, శ్రీమద్భాగవత ప్రవచనాలు, భజనలు, నామస్మరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి. మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేయనున్నారు. మానవ జన్మ సార్థకతకు, మోక్ష సాధనకు శ్రీమద్భాగవత పురాణ శ్రవణం ఎంతో విశిష్టమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. సదాశివపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రవచనాలు విని భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలని పులిమామిడి రాజు కోరారు. ఈ కార్యక్రమంలో యం. మనోహర్, సుధాకర్ రెడ్డి, పండాల జగదీశ్వర్ పంతులు, కుల్బగూర్ విజయకుమార్ చిదానందం, వాదోని చంద్రశేఖర్, విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News