సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.
సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.
Editor Desk
భువనగిరి:
జిల్లాలో సదరం (SADAREM) సేవలను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సెర్ఫ్ సీఈఓ దివ్య అధికారులకు ఆదేశించారు. యూడీఐడీ (UDID) దరఖాస్తులపై కూడా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం క్యాంపుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన క్లియర్ చేయాలని, కొత్త దరఖాస్తులను ఆలస్యం చేయకుండా నమోదు చేసి వికలాంగత సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు మాట్లాడుతూ… సదరం సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. యూడీఐడీ దరఖాస్తులు వచ్చిన వెంటనే నమోదు చేసి, రెన్యువల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.
యూడీఐడీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి, సంబంధిత డేటాను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. డిజిటైజేషన్, సరెండర్, పోగొట్టుకున్న కార్డుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఎన్హెచ్సీ, పీడబ్ల్యూడీ, స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో కార్డులు లేనివారికి వెంటనే జారీ చేయాలని తెలిపారు.
డీఆర్డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ… ఈ నెల సదరం స్లాట్లు ఇప్పటికే విడుదలయ్యాయని, లబ్ధిదారులకు ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డా. కిరణ్, ఏపీఓ (పెన్షన్) సుమన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి