Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:30 PM

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.
March 28, 2026 06:18 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:

జిల్లాలో సదరం (SADAREM) సేవలను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సెర్ఫ్ సీఈఓ దివ్య అధికారులకు ఆదేశించారు. యూడీఐడీ (UDID) దరఖాస్తులపై కూడా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం క్యాంపుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన క్లియర్ చేయాలని, కొత్త దరఖాస్తులను ఆలస్యం చేయకుండా నమోదు చేసి వికలాంగత సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు మాట్లాడుతూ… సదరం సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. యూడీఐడీ దరఖాస్తులు వచ్చిన వెంటనే నమోదు చేసి, రెన్యువల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.

యూడీఐడీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి, సంబంధిత డేటాను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. డిజిటైజేషన్, సరెండర్, పోగొట్టుకున్న కార్డుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఎన్‌హెచ్‌సీ, పీడబ్ల్యూడీ, స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో కార్డులు లేనివారికి వెంటనే జారీ చేయాలని తెలిపారు.

డీఆర్‌డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ… ఈ నెల సదరం స్లాట్లు ఇప్పటికే విడుదలయ్యాయని, లబ్ధిదారులకు ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డా. కిరణ్, ఏపీఓ (పెన్షన్) సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News