Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:32 AM

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.
28-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:

జిల్లాలో సదరం (SADAREM) సేవలను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సెర్ఫ్ సీఈఓ దివ్య అధికారులకు ఆదేశించారు. యూడీఐడీ (UDID) దరఖాస్తులపై కూడా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం క్యాంపుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన క్లియర్ చేయాలని, కొత్త దరఖాస్తులను ఆలస్యం చేయకుండా నమోదు చేసి వికలాంగత సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు మాట్లాడుతూ… సదరం సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. యూడీఐడీ దరఖాస్తులు వచ్చిన వెంటనే నమోదు చేసి, రెన్యువల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.

యూడీఐడీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి, సంబంధిత డేటాను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. డిజిటైజేషన్, సరెండర్, పోగొట్టుకున్న కార్డుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఎన్‌హెచ్‌సీ, పీడబ్ల్యూడీ, స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో కార్డులు లేనివారికి వెంటనే జారీ చేయాలని తెలిపారు.

డీఆర్‌డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ… ఈ నెల సదరం స్లాట్లు ఇప్పటికే విడుదలయ్యాయని, లబ్ధిదారులకు ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డా. కిరణ్, ఏపీఓ (పెన్షన్) సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సదరం సేవలు వేగం పెంచాలి – సీఈఓ దివ్య ఆదేశం. పెండింగ్ కేసులు లేకుండా పూర్తి చేయాలి.

Article Image

భువనగిరి:

జిల్లాలో సదరం (SADAREM) సేవలను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సెర్ఫ్ సీఈఓ దివ్య అధికారులకు ఆదేశించారు. యూడీఐడీ (UDID) దరఖాస్తులపై కూడా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం క్యాంపుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన క్లియర్ చేయాలని, కొత్త దరఖాస్తులను ఆలస్యం చేయకుండా నమోదు చేసి వికలాంగత సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు మాట్లాడుతూ… సదరం సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. యూడీఐడీ దరఖాస్తులు వచ్చిన వెంటనే నమోదు చేసి, రెన్యువల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.

యూడీఐడీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి, సంబంధిత డేటాను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. డిజిటైజేషన్, సరెండర్, పోగొట్టుకున్న కార్డుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఎన్‌హెచ్‌సీ, పీడబ్ల్యూడీ, స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో కార్డులు లేనివారికి వెంటనే జారీ చేయాలని తెలిపారు.

డీఆర్‌డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ… ఈ నెల సదరం స్లాట్లు ఇప్పటికే విడుదలయ్యాయని, లబ్ధిదారులకు ముందస్తుగా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డా. కిరణ్, ఏపీఓ (పెన్షన్) సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News