Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:16 PM

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు
March 24, 2026 09:24 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు పలు హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

15సిలిండర్ల పట్టివేత.

ఈ దాడుల్లో వాణిజ్య (కమర్షియల్) అవసరాల కోసం అక్రమంగా వాడుతున్న మొత్తం 15 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రభుత్వం సామాన్యులకు అందించే గృహోపయోగ సిలిండర్లను ఇలా యథేచ్ఛగా వ్యాపారాలకు వాడుతుండటం, దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ.. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన సిలిండర్లకు సంబంధించి, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం, సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని, ముందు ముందు కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వారు తేల్చిచెప్పారు. ఈ తనిఖీలలో డి సి ఎస్ ఓ రోజా రాణి, డిటి బాలమణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News