Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:46 AM

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు
March 24, 2026 09:24 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు పలు హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

15సిలిండర్ల పట్టివేత.

ఈ దాడుల్లో వాణిజ్య (కమర్షియల్) అవసరాల కోసం అక్రమంగా వాడుతున్న మొత్తం 15 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రభుత్వం సామాన్యులకు అందించే గృహోపయోగ సిలిండర్లను ఇలా యథేచ్ఛగా వ్యాపారాలకు వాడుతుండటం, దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ.. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన సిలిండర్లకు సంబంధించి, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం, సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని, ముందు ముందు కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వారు తేల్చిచెప్పారు. ఈ తనిఖీలలో డి సి ఎస్ ఓ రోజా రాణి, డిటి బాలమణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News