Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
‘విలన్ల వల్లే నేను హీరో’. ప్రత్యర్థులపై సీఎం రేవంత్ ధాటిగా విమర్శలు క్రైస్తవ మత మార్పిడి తర్వాత SC స్థితి రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - అట్రాసిటీ చట్టం అర్హతపై కీలక వివరణ! టీబీతో జాగ్రత్త.. ఉమ్మడి నల్గొండలో భారీగా కేసులు “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 24, 2026 11:14 PM

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు
March 24, 2026 09:24 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు పలు హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

15సిలిండర్ల పట్టివేత.

ఈ దాడుల్లో వాణిజ్య (కమర్షియల్) అవసరాల కోసం అక్రమంగా వాడుతున్న మొత్తం 15 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రభుత్వం సామాన్యులకు అందించే గృహోపయోగ సిలిండర్లను ఇలా యథేచ్ఛగా వ్యాపారాలకు వాడుతుండటం, దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ.. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన సిలిండర్లకు సంబంధించి, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం, సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని, ముందు ముందు కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వారు తేల్చిచెప్పారు. ఈ తనిఖీలలో డి సి ఎస్ ఓ రోజా రాణి, డిటి బాలమణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News