Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్
04-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి:సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగరేసే సమయంలో చైనా మాంజా వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అల్లాదుర్గం మండల ఎస్సై శంకర్ తెలిపారు. అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో గాలి పటాల వినోదం పేరుతో చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, మనుషులు, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందన్నారు.గాలి పటాలు ఎగరడానికి ఉపయోగించే నైలాన్, సింథటిక్ దారాలకు పూత పూసిన చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ మాంజా కారణంగా పక్షులు గాయపడటం, మరణించడం, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.చైనా మాంజాను నిల్వ చేసినా, రవాణా చేసినా, తయారు చేసినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్ 223, 125తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 5, 15 కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఎవరైనా చైనా మాంజా తయారీ, అమ్మకం లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై శంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి పండుగను సురక్షితంగా జరుపుకోవచ్చన్నారు.

Sthanikam

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

Article Image

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి:సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగరేసే సమయంలో చైనా మాంజా వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అల్లాదుర్గం మండల ఎస్సై శంకర్ తెలిపారు. అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో గాలి పటాల వినోదం పేరుతో చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, మనుషులు, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందన్నారు.గాలి పటాలు ఎగరడానికి ఉపయోగించే నైలాన్, సింథటిక్ దారాలకు పూత పూసిన చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ మాంజా కారణంగా పక్షులు గాయపడటం, మరణించడం, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.చైనా మాంజాను నిల్వ చేసినా, రవాణా చేసినా, తయారు చేసినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్ 223, 125తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 5, 15 కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఎవరైనా చైనా మాంజా తయారీ, అమ్మకం లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై శంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి పండుగను సురక్షితంగా జరుపుకోవచ్చన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News