Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:44 AM

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్
January 04, 2026 06:04 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి:సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగరేసే సమయంలో చైనా మాంజా వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అల్లాదుర్గం మండల ఎస్సై శంకర్ తెలిపారు. అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో గాలి పటాల వినోదం పేరుతో చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, మనుషులు, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందన్నారు.గాలి పటాలు ఎగరడానికి ఉపయోగించే నైలాన్, సింథటిక్ దారాలకు పూత పూసిన చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ మాంజా కారణంగా పక్షులు గాయపడటం, మరణించడం, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.చైనా మాంజాను నిల్వ చేసినా, రవాణా చేసినా, తయారు చేసినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్ 223, 125తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 5, 15 కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఎవరైనా చైనా మాంజా తయారీ, అమ్మకం లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై శంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి పండుగను సురక్షితంగా జరుపుకోవచ్చన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News