Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్

సంక్రాంతి పండుగలో సురక్షిత గాలి పటాలకే అనుమతి:అల్లాదుర్గం ఎస్ఐ శంకర్
January 04, 2026 06:04 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి:సంక్రాంతి పండుగ సందర్భంగా గాలి పటాలు ఎగరేసే సమయంలో చైనా మాంజా వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అల్లాదుర్గం మండల ఎస్సై శంకర్ తెలిపారు. అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో గాలి పటాల వినోదం పేరుతో చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, మనుషులు, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందన్నారు.గాలి పటాలు ఎగరడానికి ఉపయోగించే నైలాన్, సింథటిక్ దారాలకు పూత పూసిన చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ మాంజా కారణంగా పక్షులు గాయపడటం, మరణించడం, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు.చైనా మాంజాను నిల్వ చేసినా, రవాణా చేసినా, తయారు చేసినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్ 223, 125తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 5, 15 కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఎవరైనా చైనా మాంజా తయారీ, అమ్మకం లేదా రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై శంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి పండుగను సురక్షితంగా జరుపుకోవచ్చన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News