మద్యం, డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డీజేపై కఠిన చర్యలు
సంగారెడ్డి స్థానిక ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, నూతన సంవత్సర వేడుకలలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని, భద్రతా చర్యలపై ముమ్మరంగా పటిష్టమైన సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ పర్యవేక్షణ, మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులు నమోదు, డీజేలు మరియు అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సురక్షితంగా, శాంతిగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట రిత్య చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి