Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:23 AM

రూ.3 లక్షల లంచం కేసు తరువాత కొత్త మలుపు.. పులివెందుల రూరల్ సీఐ ఇంట్లో 59 మద్యం బాటిళ్లు స్వాధీనం

రూ.3 లక్షల లంచం కేసు తరువాత కొత్త మలుపు.. పులివెందుల రూరల్ సీఐ ఇంట్లో 59 మద్యం బాటిళ్లు స్వాధీనం

రూ.3 లక్షల లంచం కేసు తరువాత కొత్త మలుపు.. పులివెందుల రూరల్ సీఐ ఇంట్లో 59 మద్యం బాటిళ్లు స్వాధీనం
February 26, 2026 04:12 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప జిల్లా పులివెందులలో సంచలనం రేపిన లంచం కేసులో చిక్కిన పులివెందుల రూరల్ సీఐ ఎన్వీ రమణ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కిన సీఐ ఇంటిపై తాజాగా సోదాలు నిర్వహించారు.

ఏసీబీ అధికారులు సీఐ నివాసంలో తనిఖీలు చేపట్టగా, మొత్తం 59 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్టు గుర్తించిన అధికారులు వాటిని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించారు.

మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ చేసిన ఆరోపణలపై సీఐ రమణపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఇప్పటికే లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనపై మరో కేసు నమోదవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

లంచం కేసుతో ప్రారంభమైన ఈ వివాదం, ఇప్పుడు మద్యం నిల్వల అంశంతో మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News