రూ.3 లక్షల లంచం కేసు తరువాత కొత్త మలుపు.. పులివెందుల రూరల్ సీఐ ఇంట్లో 59 మద్యం బాటిళ్లు స్వాధీనం
రూ.3 లక్షల లంచం కేసు తరువాత కొత్త మలుపు.. పులివెందుల రూరల్ సీఐ ఇంట్లో 59 మద్యం బాటిళ్లు స్వాధీనం
GADDAM JAGANMOHAN REDDY
కడప జిల్లా పులివెందులలో సంచలనం రేపిన లంచం కేసులో చిక్కిన పులివెందుల రూరల్ సీఐ ఎన్వీ రమణ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కిన సీఐ ఇంటిపై తాజాగా సోదాలు నిర్వహించారు.
ఏసీబీ అధికారులు సీఐ నివాసంలో తనిఖీలు చేపట్టగా, మొత్తం 59 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా భారీ సంఖ్యలో మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్టు గుర్తించిన అధికారులు వాటిని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించారు.
మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ చేసిన ఆరోపణలపై సీఐ రమణపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఇప్పటికే లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనపై మరో కేసు నమోదవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
లంచం కేసుతో ప్రారంభమైన ఈ వివాదం, ఇప్పుడు మద్యం నిల్వల అంశంతో మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి