రొప్పాల దాహార్తికి ముగింపు – మంత్రి సవిత చొరవతో శాశ్వత తాగునీటి సౌకర్యం
రొప్పాల దాహార్తికి ముగింపు – మంత్రి సవిత చొరవతో శాశ్వత తాగునీటి సౌకర్యం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా లోని పెనుకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న రొద్దం మండలం, పెదమంతూరు పంచాయతీకి చెందిన రొప్పాల గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు మంత్రి సవితకు కలిసి తమ సమస్యను వివరించారు.
గ్రామస్తుల వినతిని సానుకూలంగా స్వీకరించిన మంత్రి సవితమ్మ వెంటనే స్పందించి రూ. 9 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో పెన్నానది నుంచి రొప్పాల గ్రామం వరకు వాటర్ లింక్ ద్వారా పైప్లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా పనులు విజయవంతంగా పూర్తి చేశారు.
పనులు పూర్తయ్యాక మోటార్ను అమర్చుకుని పరీక్షించగా పుష్కలంగా నీరు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా గ్రామాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించిన మంత్రి సవితమ్మకు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్న మంత్రి సవిత సేవలను ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి