Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్ రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 09:35 PM

రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం – తుర్కపల్లి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం – తుర్కపల్లి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం – తుర్కపల్లి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
April 28, 2026 07:39 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేయడంతో పాటు ప్రయోగశాల, ఔషధ నిల్వ విభాగం, ఇతర సేవా విభాగాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి క్రమం తప్పకుండా పరీక్షలు జరుగుతున్నాయా, అవసరమైన మందులు అందుతున్నాయా అనే విషయాలను ఆరా తీశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలనీ, ఆసుపత్రిలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సహా అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారి వివరించారు. ప్రతిరోజు లోపలి రోగులు, బాహ్య రోగుల సంఖ్య, గర్భిణీల పరీక్షలు, అందుబాటులో ఉన్న వైద్య పరీక్షలు, ప్రతి నెల జరిగే ప్రసవాల సంఖ్య వంటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందుతుందని, ముఖ్యంగా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ తనిఖీలో ఉప కలెక్టర్ ఉమా హారతి, మండల అభివృద్ధి అధికారి, వైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News