భువనగిరి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి ప్రాణాలను కాపాడే విధానాలపై అవగాహన కల్పించేందుకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ శిక్షణలో అంబులెన్స్, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది, నేషనల్ హైవే రెస్పాన్స్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఆర్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, రాహ్-వీర్ పథకం, ప్రథమ చికిత్స వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
డీఎంహెచ్ఓ, డాక్టర్ అబేద్ అలీ శిక్షణను నిర్వహించగా, డీటీఓ శ్రీ సాయి కృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు చంద్రబాబు, ఎం. రమేష్, మధుబాబు, ఎస్ఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి