రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించిన; ఎస్ ఐ క్రాంతి కుమార్
రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించిన; ఎస్ ఐ క్రాంతి కుమార్
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల పరిధి గానుగుబండ ఎక్స్ రోడ్డు వద్ద పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై ప్రజలకుఅవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ ఐ క్రాంతి కుమార్ సామాజిక అంశాలు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత, సైబర్ మోసాల నివారణ, డ్రగ్స్ గంజాయి నిర్మూలన, సామాజిక భద్రత పౌరుల బాధ్యత అంశాల పట్ల అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారూ. రోడ్డు ప్రయాణ సమయంలో నియమ నిబంధన పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం ప్రయాణికులను రవాణా చేయడం వల్ల వాహనం అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రమాదమని పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే అవగాహన లోపంతో వేగంగా వాహనాలను ప్రమాదాలకు గురవుతూ ఇతరులను ప్రమాదాలకు గురి చేస్తారని తెలిపారు. పెద్ద వాహనదారులు ప్రయాణ సమయంలో జంక్షన్లు, ప్రమాదాల స్థలాలు, గ్రామీణ రోడ్ల వద్ద అప్రమత్తంగా వాహనాలు నడపాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలలో ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి