PRINT TIME: April 19, 2026 08:18 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
April 19, 2026 05:20 PM
114 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. కుసుమవారి గూడెం సమీపంలో ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం… కాసరాబాద్ గ్రామానికి చెందిన కల్లు సందీప్ బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి