Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 02:38 PM

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి
April 15, 2026 04:31 PM 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు జావీద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఖమ్మం–హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో జావీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నది.

సమాచారం అందుకున్న వెంటనే రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News