PRINT TIME: June 22, 2026 01:43 PM
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి
April 15, 2026 04:31 PM
243 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు జావీద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఖమ్మం–హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో జావీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నది.
సమాచారం అందుకున్న వెంటనే రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి