రంజోల్, మాచ్నూర్, కాశీపూర్ విద్యాసంస్థల్లో షీ టీమ్ అవగాహన సదస్సు
రంజోల్, మాచ్నూర్, కాశీపూర్ విద్యాసంస్థల్లో షీ టీమ్ అవగాహన సదస్సు
Krishna
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో రంజోల్ పాలిటెక్నిక్ కాలేజ్, మాచ్నూర్ కేంద్రీయ విద్యాలయం, కాశీపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్ మాట్లాడుతూ జిల్లాలో మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్ బృందాలు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, మహిళల హక్కులు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాలు, ఫేక్ అకౌంట్లు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్లైన్ వేధింపులు వంటి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930, చైల్డ్ హెల్ప్లైన్ 1098 మరియు సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్, సిబ్బంది, కళాశాలలు మరియు పాఠశాలల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి