రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చిరుమర్తి లింగయ్య
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చిరుమర్తి లింగయ్య
ఎడిటోరియల్ టీమ్
రామన్నపేట మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఎస్కే చాందు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఈద్ ముబారక్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు ప్రతి ముస్లిం కుటుంబంపై ఉండాలని, అందరూ ఆరోగ్యంగా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, పల్లివాడ ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, నాయకులు బత్తుల వెంకన్న, కోనూరు ముత్తయ్య, బండ శ్రీనివాస్ రెడ్డి, చొప్పరి నరసింహ, బాలగోని నరసింహ, ఆవుల నరేందర్, ఎండి అజాజ్ ఖాన్, మంటి లింగస్వామి, ఆవుల శ్రీధర్, రాస వెంకటేశ్వర్లు, బొలుగుల కృష్ణ, జాల అమరేందర్ రెడ్డి, నల్ల సైదులు, ఎండి మోసబ్, బాసాని రాజు, ఎండి ఆరిఫ్, లింగస్వామి, పావిరాల నరసింహ, రైమహన్, భరత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి