రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ
Biksham Goud
సూర్యాపేట 29వ వార్డులో ఘనంగా కార్యక్రమం నిర్వహణ
సూర్యాపేట పట్టణంలోని 29వ వార్డులో కౌన్సిలర్ రాపర్తి భవాని శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సౌభ్రాతృత్వానికి, స్నేహభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని, పండుగల ద్వారా పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి గారు, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి గారు, గుణగంటి హేమ సతీష్ గారు, మాజీ కౌన్సిలర్ అనంతుల యాదగిరి గారు, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కక్కిరెని శ్రీనివాస్ గారు, అనంతుల నాగరాజు గారు, నర్సింగ్ నాగరాజు గారు, రాచకొండ నాగార్జున గారు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో ముస్లిం సోదరులకు అవసరమైన తోఫాలను పంపిణీ చేయడంతో పాటు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి