రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి
Biksham Goud
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటించాలని కోరారు. త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినం సమాజానికి ఐక్యతను అందిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో కుల, మతాల ఐక్యతను పెంపొందించడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాత్ర విశేషమని తెలిపారు. ఆయన పాలనలోనే పండుగల ప్రాధాన్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రధాన పండుగలను ప్రభుత్వ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నామని, గాంధీ వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ని కొనియాడారు. గంగా జామున తహజీబ్ తరహాలో తెలంగాణలో అన్ని మతాలు కలిసిమెలసి జీవిస్తున్నాయని చెప్పారు. గత పన్నెండేళ్లుగా పండుగలన్నీ ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకుంటున్నామని, ఇదే సంప్రదాయాన్ని ముందుతరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది కూడా రంజాన్ పర్వదినాన్ని ఐక్యతతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరోసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి