ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం
తెలంగాణ ప్రభుత్వం మరో నూతన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరుతో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించనున్నట్లు ప్రకటించింది.ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించగా, జూన్ 2వ తేదీన పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ పథకం కింద రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల వరకు జీవిత బీమా వర్తింపజేయనున్నారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అర్హులైన పౌరులందరికీ ఈ పథకం అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి