రెండో రోజు 230 నామినేషన్లు దాఖలు
రెండో రోజు 230 నామినేషన్లు దాఖలు
Biksham
స్థానికం ప్రతినిధి
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గురువారం వరకు రెండు రోజుల్లో మొత్తం 243 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రెండో రోజు గురువారం ఒక్కరోజే 230 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడంతో మున్సిపాలిటీ కార్యాలయం పరిసరాలు కోలాహలంగా మారాయి.పార్టీల వారీగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి 94 మంది, బీఆర్ఎస్ నుంచి 62 మంది, బీజేపీ నుంచి 28 మంది, బీఎస్పీ నుంచి 3 మంది, సీపీఐఎం నుంచి 2 మంది, ఎంఐఎం నుంచి 2 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులు 37 మంది ఉండగా, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.బుధవారం మొదటి రోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, గురువారం రెండో రోజు 230 మంది నామినేషన్లు వేశారు. రెండు రోజులు కలిపి మొత్తం 243 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
రానున్న రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి