రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు
రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రెండవ గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం చేసి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు–కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. హారతి సమర్పించి నైవేద్యం నివేదించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏడు వారాల జాతరలో రెండవ గురువారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదని, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటని, ఇక్కడ మొక్కులు పెట్టిన భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి