Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:59 PM

రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు

రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు

రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు
30-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రెండవ గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం చేసి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు–కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. హారతి సమర్పించి నైవేద్యం నివేదించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏడు వారాల జాతరలో రెండవ గురువారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదని, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటని, ఇక్కడ మొక్కులు పెట్టిన భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

Sthanikam

రెండవ గురువారం ప్రత్యేక పూజలతో ఘనంగా నల్లపోచమ్మ ఉత్సవాలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రెండవ గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దు స్వామి, నాగేష్ స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో మహాభిషేకం చేసి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు–కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. హారతి సమర్పించి నైవేద్యం నివేదించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఏడు వారాల జాతరలో రెండవ గురువారం ప్రత్యేక ప్రాధాన్యం కలిగినదని, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటని, ఇక్కడ మొక్కులు పెట్టిన భక్తుల కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News