Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి

రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి

రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి
27-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం గోపురం

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ పట్టణంలోని రెండవ భద్రాద్రిగా వెలుగొందుతున్న రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు రామగిరి దేవాలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. రెండవ భద్రాద్రిగా పేరు నిలబెట్టేలా ఆలయాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భక్తులకు వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన భూముల సేకరణపై చర్చలు కొనసాగుతున్నాయని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను కాపాడుతూ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆలయ భూములకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారిని బైపాస్ మార్గంలో మళ్లించినట్లు తెలిపారు.

కళ్యాణోత్సవానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు తమ నివాసం నుంచి బాజా భజంత్రీల మధ్య ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం నవమి వేడుకల సందర్భంగా మంత్రి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించగా సుమారు 4 వేల మందికి భోజన వసతి కల్పించారు.

మేయర్ మాట్లాడుతూ మంత్రి సహకారంతో రామగిరి రామాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో జయరామయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి

Article Image

వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం గోపురం

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ పట్టణంలోని రెండవ భద్రాద్రిగా వెలుగొందుతున్న రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు రామగిరి దేవాలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. రెండవ భద్రాద్రిగా పేరు నిలబెట్టేలా ఆలయాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భక్తులకు వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

దర్శన మార్గాల విస్తరణ కోసం అవసరమైన భూముల సేకరణపై చర్చలు కొనసాగుతున్నాయని, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను కాపాడుతూ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆలయ భూములకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారిని బైపాస్ మార్గంలో మళ్లించినట్లు తెలిపారు.

కళ్యాణోత్సవానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు తమ నివాసం నుంచి బాజా భజంత్రీల మధ్య ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం నవమి వేడుకల సందర్భంగా మంత్రి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించగా సుమారు 4 వేల మందికి భోజన వసతి కల్పించారు.

మేయర్ మాట్లాడుతూ మంత్రి సహకారంతో రామగిరి రామాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో జయరామయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News