రాయిపల్లి డ్యాం ప్రాంతాన్ని సందర్శించిన:ఖేఢ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి
రాయిపల్లి డ్యాం ప్రాంతాన్ని సందర్శించిన:ఖేఢ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం రాయిపల్లి గ్రామ శివారులో సింగూర్ ప్రాజెక్టు మరమ్మత్తు పనుల నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేయడంతో నిజాం కాలంలో నిర్మించిన పురాతన డ్యాం వెలుగులోకి రావడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అక్కడికి చేరుకుని పురాతన ఆనకట్టను పరిశీలించారు. డ్యాం నిర్మాణ శైలి, దాని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ఆయన రైతులు, గ్రామ ప్రజలతో మాట్లాడి గతంలో ఈ డ్యాం ద్వారా సాగునీటి వినియోగం ఎలా ఉండేదనే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి, ఈ ప్రాంతంలో కొత్త డ్యాం లేదా అత్యాధునిక రబ్బర్ డ్యాం నిర్మాణానికి ఉన్న అవకాశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పురాతన డ్యాం ఆధారంగా కొత్త నిర్మాణం చేపడితే వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని తెలిపారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, నీటిపారుదల శాఖ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి