Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 12:59 AM

రాయిపల్లి డ్యాం ప్రాంతాన్ని సందర్శించిన:ఖేఢ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి

రాయిపల్లి డ్యాం ప్రాంతాన్ని సందర్శించిన:ఖేఢ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి

రాయిపల్లి డ్యాం ప్రాంతాన్ని సందర్శించిన:ఖేఢ్ ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి
May 29, 2026 07:54 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం రాయిపల్లి గ్రామ శివారులో సింగూర్ ప్రాజెక్టు మరమ్మత్తు పనుల నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేయడంతో నిజాం కాలంలో నిర్మించిన పురాతన డ్యాం వెలుగులోకి రావడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అక్కడికి చేరుకుని పురాతన ఆనకట్టను పరిశీలించారు. డ్యాం నిర్మాణ శైలి, దాని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ఆయన రైతులు, గ్రామ ప్రజలతో మాట్లాడి గతంలో ఈ డ్యాం ద్వారా సాగునీటి వినియోగం ఎలా ఉండేదనే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఈ ప్రాంతంలో కొత్త డ్యాం లేదా అత్యాధునిక రబ్బర్ డ్యాం నిర్మాణానికి ఉన్న అవకాశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పురాతన డ్యాం ఆధారంగా కొత్త నిర్మాణం చేపడితే వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని తెలిపారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, నీటిపారుదల శాఖ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News