రాష్ట్ర ఉన్నతాధికారికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
రాష్ట్ర ఉన్నతాధికారికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కే. రామకృష్ణారావుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఘనస్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు నారాయణఖేడ్కు వచ్చిన ఆయన పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్కు చేరుకోగా, ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నియోజకవర్గ ప్రజల తరపున ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి మన ప్రాంతానికి రావడం ఆనందకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సేట్, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహాన్, సుబూర్, కౌన్సిలర్లు, పండరి రెడ్డి, ముంతాజ్ సేట్ మాజీ ఎంపీటీసీలు, నారాయణ జాదవ్ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి