Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:02 PM

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసిన మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
April 30, 2026 02:44 PM 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావుకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఘన స్వాగతం పలికారు. తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయనను పట్టణంలోని మహా ఫంక్షన్ హాల్‌లో చైర్మన్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పట్టణ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి మన ప్రాంతాన్ని సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చైర్మన్, ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ సహకారం మరింత అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, లక్ష్మణ్, చంద్రశేఖర్, అప్పారావు, కొండల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News