Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
07-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు పాఠశాలలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం కిరణ్ కుమార్ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా తలకు దెబ్బ తాకడం ద్వారానే మరణిస్తున్నారని, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగుల వల్ల ఉపయోగం అన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని సూచించారు. విద్యార్థులంతా తమ కుటుంబ పెద్దలకు రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం విద్యార్థులు ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టడంతో వెహికల్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ ఎన్నిసార్లు చప్పట్లు కొట్టారో అంతా మందికి రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు పాఠశాలలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం కిరణ్ కుమార్ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా తలకు దెబ్బ తాకడం ద్వారానే మరణిస్తున్నారని, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగుల వల్ల ఉపయోగం అన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని సూచించారు. విద్యార్థులంతా తమ కుటుంబ పెద్దలకు రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం విద్యార్థులు ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టడంతో వెహికల్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ ఎన్నిసార్లు చప్పట్లు కొట్టారో అంతా మందికి రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News