Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:11 AM

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
January 07, 2026 08:35 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు పాఠశాలలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం కిరణ్ కుమార్ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా తలకు దెబ్బ తాకడం ద్వారానే మరణిస్తున్నారని, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగుల వల్ల ఉపయోగం అన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని సూచించారు. విద్యార్థులంతా తమ కుటుంబ పెద్దలకు రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం విద్యార్థులు ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టడంతో వెహికల్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ ఎన్నిసార్లు చప్పట్లు కొట్టారో అంతా మందికి రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News