రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు పాఠశాలలలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం కిరణ్ కుమార్ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా తలకు దెబ్బ తాకడం ద్వారానే మరణిస్తున్నారని, హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందన్నారు. కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగుల వల్ల ఉపయోగం అన్నారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని సూచించారు. విద్యార్థులంతా తమ కుటుంబ పెద్దలకు రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం విద్యార్థులు ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టడంతో వెహికల్ ఇన్స్పెక్టర్ స్పందిస్తూ ఎన్నిసార్లు చప్పట్లు కొట్టారో అంతా మందికి రోడ్డు భద్రత విద్య గురించి తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి