రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం
రామన్నపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశం
స్థానికం బృందం
ఉదయ్ భాను చిబ్ అరెస్టుపై నిరసన – మోదీ దిష్టిబొమ్మ దహనం
రామన్నపేట: మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేకల ప్రమోద్ రెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సమావేశంలో నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యువత సమస్యలపై ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అనంతరం పట్టణంలోని సుభాష్ సెంటర్లో ఉదయ్ భాను చిబ్ అరెస్టును ఖండిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ జాల మణికంఠ, ఉపాధ్యక్షుడు ముజాహిద్, జిల్లా పృథ్వీరాజ్, మహేష్ రెడ్డి, కల్లూరి శివ, కేస సాయి, మేకల జలంధర్, రుద్రాల విక్కి, వేణు, మొహమ్మద్ జానీ, అంబాల అశోక్, గండికోట ప్రతాప్, సుర్వి నవీన్, సుర్వి మచ్చగిరి, పల్లెర్ల రవీందర్ రెడ్డి, శరత్, శ్రీమాన్, శేఖర్, తండా వెంకటేష్, కల్లూరి మహేష్, వీరమల్ల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి