రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్
రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్
స్థానికం బృందం
రామన్నపేట పట్టణంలోని పలు కాలనీలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉప్ప సర్పంచ్ మోటె రమేష్ సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పట్టణంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్థంభాలకు తక్కువ వోల్టేజ్, 11 కేవీ, 33 కేవీ లైన్లు అన్నీ ఒకే పెద్ద స్థంభాలపై సమగ్రంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేస్తే భద్రతతో పాటు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.
అలాగే ఎస్సీ కాలనీలో గొర్ల మల్లయ్య ఇంటి మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ను తొలగించి ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి మీదుగా లైన్ ఉండటం ప్రమాదకరమని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని భువనగిరి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి రహదారి విస్తరణకు అనుకూలంగా మార్చాలని కోరారు. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో నకిరేకంటి సుదర్శన్, బండ లింగస్వామి, మోట్ మహేష్, జడ సంతోష్, సుర్వి హరిబాబు, ఊట్కూరి శ్రీను, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి