Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:58 PM

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్
26-02-2026 232 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని పలు కాలనీలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉప్ప సర్పంచ్ మోటె రమేష్ సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

పట్టణంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్థంభాలకు తక్కువ వోల్టేజ్, 11 కేవీ, 33 కేవీ లైన్లు అన్నీ ఒకే పెద్ద స్థంభాలపై సమగ్రంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేస్తే భద్రతతో పాటు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.

అలాగే ఎస్సీ కాలనీలో గొర్ల మల్లయ్య ఇంటి మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించి ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి మీదుగా లైన్ ఉండటం ప్రమాదకరమని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని భువనగిరి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి రహదారి విస్తరణకు అనుకూలంగా మార్చాలని కోరారు. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకంటి సుదర్శన్, బండ లింగస్వామి, మోట్ మహేష్, జడ సంతోష్, సుర్వి హరిబాబు, ఊట్కూరి శ్రీను, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్

Article Image

రామన్నపేట పట్టణంలోని పలు కాలనీలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉప్ప సర్పంచ్ మోటె రమేష్ సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

పట్టణంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్థంభాలకు తక్కువ వోల్టేజ్, 11 కేవీ, 33 కేవీ లైన్లు అన్నీ ఒకే పెద్ద స్థంభాలపై సమగ్రంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేస్తే భద్రతతో పాటు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.

అలాగే ఎస్సీ కాలనీలో గొర్ల మల్లయ్య ఇంటి మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించి ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి మీదుగా లైన్ ఉండటం ప్రమాదకరమని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని భువనగిరి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి రహదారి విస్తరణకు అనుకూలంగా మార్చాలని కోరారు. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకంటి సుదర్శన్, బండ లింగస్వామి, మోట్ మహేష్, జడ సంతోష్, సుర్వి హరిబాబు, ఊట్కూరి శ్రీను, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News