Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 11:57 PM

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్

రామన్నపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి. ఉప్ప సర్పంచ్ మోటె రమేష్
February 26, 2026 03:38 PM 221 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని పలు కాలనీలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉప్ప సర్పంచ్ మోటె రమేష్ సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

పట్టణంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్థంభాలకు తక్కువ వోల్టేజ్, 11 కేవీ, 33 కేవీ లైన్లు అన్నీ ఒకే పెద్ద స్థంభాలపై సమగ్రంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేస్తే భద్రతతో పాటు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.

అలాగే ఎస్సీ కాలనీలో గొర్ల మల్లయ్య ఇంటి మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించి ప్రత్యామ్నాయ మార్గంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి మీదుగా లైన్ ఉండటం ప్రమాదకరమని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని భువనగిరి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించి రహదారి విస్తరణకు అనుకూలంగా మార్చాలని కోరారు. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకంటి సుదర్శన్, బండ లింగస్వామి, మోట్ మహేష్, జడ సంతోష్, సుర్వి హరిబాబు, ఊట్కూరి శ్రీను, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News