Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ
19-03-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా అభివృద్ధి చేయాలని సిపిఎం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు తాత్కాలికంగా విరమించబడ్డాయి.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ దీక్షలకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ఆర్డీఓ శేఖర్ రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆసుపత్రి అభివృద్ధి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షలను విరమించినట్లు తెలిపారు.

అయితే హామీలు అమలు చేయకపోతే దశలవారీగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.

వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, కందుల హనుమంతు,మండల కమిటి సభ్యులు గోరిగే సోములు, నాకటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ

Article Image

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా అభివృద్ధి చేయాలని సిపిఎం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు తాత్కాలికంగా విరమించబడ్డాయి.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ దీక్షలకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ఆర్డీఓ శేఖర్ రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆసుపత్రి అభివృద్ధి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షలను విరమించినట్లు తెలిపారు.

అయితే హామీలు అమలు చేయకపోతే దశలవారీగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.

వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, కందుల హనుమంతు,మండల కమిటి సభ్యులు గోరిగే సోములు, నాకటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News