Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 19, 2026 06:10 PM

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ

రామన్నపేటలో ఆర్డీఓ హామీతో సిపిఎం దీక్షల విరమణ
March 19, 2026 04:22 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలుగా అభివృద్ధి చేయాలని సిపిఎం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు తాత్కాలికంగా విరమించబడ్డాయి.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ దీక్షలకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ఆర్డీఓ శేఖర్ రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆసుపత్రి అభివృద్ధి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షలను విరమించినట్లు తెలిపారు.

అయితే హామీలు అమలు చేయకపోతే దశలవారీగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.

వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, కందుల హనుమంతు,మండల కమిటి సభ్యులు గోరిగే సోములు, నాకటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News