Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:54 AM

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా పెంచాలి

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా పెంచాలి

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా పెంచాలి
March 16, 2026 02:32 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిపిఎం నిరాహార దీక్షకు కల్లుగీత కార్మిక సంఘం సంఘీభావం

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సంఘీభావం తెలిపింది.

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజుల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు భావనల పెండ్లి బాలరాజు దీక్షలో పాల్గొని మండల కమిటీ సభ్యులను పూలమాలలు వేసి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 400 మంది ఓపీ ద్వారా వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి 30 పడకలతో మాత్రమే కొనసాగుతుండటంతో సరైన వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలకే రోగులను నల్లగొండ, హైదరాబాద్‌కు రిఫర్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ అధ్యక్షుడు కునూరు మల్లేశం, కోశాధికారి మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, తోర్పునూరి శ్రీనివాస్, గుండాల ప్రసాద్, కునూరు గణేష్, అంతటి సత్తయ్య, బావండ్లపల్లి సత్యం, అంతటి నరసింహ, తాళ్లపల్లి జితేందర్, గుడిసె మల్లేశం, గంగాదేవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News