రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా పెంచాలి
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా పెంచాలి
స్థానికం బృందం
సిపిఎం నిరాహార దీక్షకు కల్లుగీత కార్మిక సంఘం సంఘీభావం
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సంఘీభావం తెలిపింది.
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజుల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు భావనల పెండ్లి బాలరాజు దీక్షలో పాల్గొని మండల కమిటీ సభ్యులను పూలమాలలు వేసి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 400 మంది ఓపీ ద్వారా వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి 30 పడకలతో మాత్రమే కొనసాగుతుండటంతో సరైన వైద్య సేవలు అందడం లేదని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలకే రోగులను నల్లగొండ, హైదరాబాద్కు రిఫర్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ అధ్యక్షుడు కునూరు మల్లేశం, కోశాధికారి మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, తోర్పునూరి శ్రీనివాస్, గుండాల ప్రసాద్, కునూరు గణేష్, అంతటి సత్తయ్య, బావండ్లపల్లి సత్యం, అంతటి నరసింహ, తాళ్లపల్లి జితేందర్, గుడిసె మల్లేశం, గంగాదేవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి