Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 09:21 PM

రామన్నపేట నిరవధిక నిరాహార దీక్షలో క్షీణిస్తున్న నాయకుల ఆరోగ్యం

రామన్నపేట నిరవధిక నిరాహార దీక్షలో క్షీణిస్తున్న నాయకుల ఆరోగ్యం

 రామన్నపేట నిరవధిక నిరాహార దీక్షలో క్షీణిస్తున్న నాయకుల ఆరోగ్యం
March 17, 2026 07:40 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వంద పడకల ఆసుపత్రి హామీ ఇచ్చేదాకా దీక్ష విరమించేది లేదు

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జిల్లెల పెంటయ్య

నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంలో మండలంలోని వివిధ రంగాల సంస్థలు, ప్రజల నుండి ప్రజాదరణ పెరుగుతుందని అన్నారు. దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంగా వివేకానంద డివైన్ మోడల్ స్కూల్, డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు, మండల పాత్రికేయులు,మండల మెడికల్ షాప్స్(కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్) మండల అసోసియేషన్ సభ్యులు, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, లాయర్స్ యూనియన్ అసోసియేషన్ నాయకులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ,పూల బండ్ల షాప్ల మహిళలు స్వచ్ఛందంగా నిరవధిక నిరాహార దీక్షలో శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఒకవైపు నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం ప్రజాపాలనలో ప్రజల కోసం పోరాటానికి మద్దతు తెలపకపోవడం విచారకరమని అన్నారు.

నిరవధిక దీక్షలో కూర్చున్న నాయకుల ఆరోగ్యం క్షీణిస్తుందని యాత్ర సభ్యులలో ఒకరికి బి.పి లెవెల్స్ ఎచ్చుతగ్గులవుతున్నాయని,ఇద్దరు వ్యక్తులకు షుగర్ లేవల్స్ తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు

దీక్షలలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బల్బురి అంజయ్య మండల నాయకులు గన్నెబోయిన విజయభాస్కర్,గాదె నరేందర్, పులి భిక్షం,ఎండి రషీద్ ,బొడిగె రజిత, నీల ఐలయ్య,మునుకుంట్ల లెనిన్,పావురాల మత్స్యగిరి గంటపాక శివకుమార్ పుట్టల ఉదయ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News