రామన్నపేట డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ
రామన్నపేట డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ
స్థానికం బృందం
క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన
క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన
రామన్నపేట:
క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్ క్రాఫ్ట్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ యువతీ యువకులు స్వశక్తితో ఎదగడానికి జ్యూట్ బ్యాగుల తయారీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమానికి హాజరైన జ్యూట్ బ్యాగుల తయారీ నిపుణురాలు శైలజ మాట్లాడుతూ జ్యూట్ బ్యాగుల అల్లిక విధానం, వాటి మార్కెటింగ్ అవకాశాలపై విద్యార్థులకు ప్రాయోగికంగా శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రాకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకునే దిశగా ముందుకు రావాలని సూచించారు. జ్యూట్ బ్యాగుల తయారీ ద్వారా ఉపాధి పొందడమే కాకుండా ఆర్థికంగా ఎదగవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ జే. చిన్నబాబు, డాక్టర్ సునీత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీనివాస్, ఏఓ జి. కరుణాకర్, అమర్, జె. నరేష్, ఏ. ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి