Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:57 AM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ

రామన్నపేట డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ

రామన్నపేట డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ
March 17, 2026 05:19 AM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన

క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన

రామన్నపేట:

క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమంలో భాగంగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్ క్రాఫ్ట్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ యువతీ యువకులు స్వశక్తితో ఎదగడానికి జ్యూట్ బ్యాగుల తయారీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమానికి హాజరైన జ్యూట్ బ్యాగుల తయారీ నిపుణురాలు శైలజ మాట్లాడుతూ జ్యూట్ బ్యాగుల అల్లిక విధానం, వాటి మార్కెటింగ్ అవకాశాలపై విద్యార్థులకు ప్రాయోగికంగా శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రాకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకునే దిశగా ముందుకు రావాలని సూచించారు. జ్యూట్ బ్యాగుల తయారీ ద్వారా ఉపాధి పొందడమే కాకుండా ఆర్థికంగా ఎదగవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ జే. చిన్నబాబు, డాక్టర్ సునీత, ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ల శ్రీనివాస్, ఏఓ జి. కరుణాకర్, అమర్, జె. నరేష్, ఏ. ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News