Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:07 AM

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి
17-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

100 పడకల ఆసుపత్రికి 40 కోట్లు కేటాయించాలి

రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐఎల్యూస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగత్తయ్య మాట్లాడుతూ, పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అత్యవసరమని అన్నారు. రామన్నపేట ఆసుపత్రి చుట్టుపక్కల ఏడు మండలాల ప్రజలకు కేంద్రంగా సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు.

అందువల్ల ఆసుపత్రిని తక్షణమే 100 పడకల స్థాయికి పెంచి, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

Article Image

100 పడకల ఆసుపత్రికి 40 కోట్లు కేటాయించాలి

రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐఎల్యూస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగత్తయ్య మాట్లాడుతూ, పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అత్యవసరమని అన్నారు. రామన్నపేట ఆసుపత్రి చుట్టుపక్కల ఏడు మండలాల ప్రజలకు కేంద్రంగా సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు.

అందువల్ల ఆసుపత్రిని తక్షణమే 100 పడకల స్థాయికి పెంచి, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News