రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి
రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి
Editor Desk
100 పడకల ఆసుపత్రికి 40 కోట్లు కేటాయించాలి
రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐఎల్యూస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగత్తయ్య మాట్లాడుతూ, పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అత్యవసరమని అన్నారు. రామన్నపేట ఆసుపత్రి చుట్టుపక్కల ఏడు మండలాల ప్రజలకు కేంద్రంగా సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు.
అందువల్ల ఆసుపత్రిని తక్షణమే 100 పడకల స్థాయికి పెంచి, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి