Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:16 AM

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

రామన్నపేట ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి
March 17, 2026 04:24 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

100 పడకల ఆసుపత్రికి 40 కోట్లు కేటాయించాలి

రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐఎల్యూస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగత్తయ్య మాట్లాడుతూ, పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అత్యవసరమని అన్నారు. రామన్నపేట ఆసుపత్రి చుట్టుపక్కల ఏడు మండలాల ప్రజలకు కేంద్రంగా సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు.

అందువల్ల ఆసుపత్రిని తక్షణమే 100 పడకల స్థాయికి పెంచి, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.40 కోట్ల నిధులు కేటాయించాలని, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News