రామన్నగూడెంలో చలివేంద్రం ప్రారంభం
రామన్నగూడెంలో చలివేంద్రం ప్రారంభం
Biksham
వేసవి వేడిలో ప్రజలకు తాగునీటి ఉపశమనం
మండలంలోని రామన్నగూడెం స్టేజి వద్ద నల్లగొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చందా దాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రయాణికులు, గ్రామ ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, రామన్నగూడెం సర్పంచ్ ఆరాల శైలేజా వెంకటేశ్వర్లు, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, చింతమళ్ల రమేష్, కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, ఆలేటి మాణిక్యం, వెన్న మధుకర్ రెడ్డి, నారాయణ ప్రవీణ్ రెడ్డి, మిద్దె శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి