Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:23 PM

రామన్నగూడెంలో చలివేంద్రం ప్రారంభం

రామన్నగూడెంలో చలివేంద్రం ప్రారంభం

రామన్నగూడెంలో చలివేంద్రం ప్రారంభం
April 11, 2026 05:13 PM 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


వేసవి వేడిలో ప్రజలకు తాగునీటి ఉపశమనం

మండలంలోని రామన్నగూడెం స్టేజి వద్ద నల్లగొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చందా దాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రయాణికులు, గ్రామ ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, రామన్నగూడెం సర్పంచ్ ఆరాల శైలేజా వెంకటేశ్వర్లు, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, చింతమళ్ల రమేష్, కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, ఆలేటి మాణిక్యం, వెన్న మధుకర్ రెడ్డి, నారాయణ ప్రవీణ్ రెడ్డి, మిద్దె శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News