Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:10 PM

రక్తదానం చేద్దాం. ప్రాణాలు కాపాడుదాం

రక్తదానం చేద్దాం. ప్రాణాలు కాపాడుదాం

రక్తదానం చేద్దాం. ప్రాణాలు కాపాడుదాం
March 01, 2026 06:50 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

హిందూపురం పట్టణం లోని ప్రభుత్వ వైద్యశాలలో కిరికెర గ్రామానికి చెందిన నరసింహ మూర్తి అనే బాధితుడు ఓ నెగిటివ్ రక్తం కోసం ఇబ్బంది పడుతుంటే అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ఖాన్,రఘునాథ్ ను సంప్రదించి నరసింహమూర్తి కు దాత రఘునాథ్ ద్వారా రక్తం అందజేశారు.ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ రక్త దాన సంఘం సభ్యులు ఆజం.జమీర్ రక్తనిధి ఉద్యోగి వలీ తదితరులు పాల్గొన్నారు.30 వసారి రక్తదానం చేసిన రఘునాథ్ కు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ ద్వారా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం 25సంవత్సరాలనుండి కుల మతాలకు అతీతంగా 2వేల మంది రక్తదాతలతో ఆంధ్రప్రదేశ్. కర్ణాటక. తెలంగాణా రాష్ట్రాలలో అత్యవసర. తలసీమియా. ప్రసవ. శస్త్ర చికిత్సలకు అత్యవసర సమయాల్లో రక్తం అందజేస్తూ వసుధైక కుటుంబ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తోందని అన్నారు.ఇప్పటి వరకు 23వేల మంది బాధితులకు రక్తహీనత .తలసీమియా.ప్రసవాలు. శస్త్ర చికిత్సలకు దాతల ద్వారా రక్తం అందజేశామని అపోహలు విడనాడి యువతీయువకులు రక్తదానం చేసి లక్షలాది మంది తలసీమియా బాధితో మరణిస్తున్న చిన్నారులకు ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News