PRINT TIME: May 26, 2026 04:36 PM
రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆలయ అభివృద్ధికి కొత్త కమిటీ
రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆలయ అభివృద్ధికి కొత్త కమిటీ
March 24, 2026 07:50 PM
36 Views
స్థానికం ప్రతినిధి :
Rangareddy dist
RAPOLU LINGASWAMY
పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో దేవాలయాల అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. కాలనీలోని దేవాలయానికి కొత్త కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కమిటీ నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ నిర్వహణను పారదర్శకంగా కొనసాగించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
కాలనీ వాసులు కూడా తమ వంతు సహకారం అందించి దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరచాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం ఘనంగా జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి