రాజేష్ మృతిపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం: రామచందర్ రావు
రాజేష్ మృతిపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం: రామచందర్ రావు
Harish HS
రాజేష్ మృతి ముమ్మాటికీ పోలీసుల వేధింపులే: ఎన్. రామచందర్ రావు
దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, ఇది పోలీసుల అతి ప్రవర్తన వల్లే జరిగిందని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం కోదాడలో రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజేష్ను అక్రమంగా నిర్బంధించి, కోర్టులో హాజరుపరచకుండా నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునే ప్రభుత్వం, దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక యువకుడి మృతి మాత్రమే కాదని, దళిత సమాజంపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, జుట్టు కొండా సత్యనారాయణ,కొప్పుల నరసింహారెడ్డి, మురళీధర్ రెడ్డి, వంగవీటి శ్రీనివాస్,బండారు కవిత రెడ్డి, అంజి యాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల వెంకటరామయ్య,నూనె సులోచన, యదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి