Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

రాజేష్ మృతిపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రామచందర్ రావు

రాజేష్ మృతిపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రామచందర్ రావు

రాజేష్ మృతిపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రామచందర్ రావు
February 09, 2026 10:14 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రాజేష్ మృతి ముమ్మాటికీ పోలీసుల వేధింపులే: ఎన్. రామచందర్ రావు

దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, ఇది పోలీసుల అతి ప్రవర్తన వల్లే జరిగిందని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం కోదాడలో రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజేష్‌ను అక్రమంగా నిర్బంధించి, కోర్టులో హాజరుపరచకుండా నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునే ప్రభుత్వం, దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక యువకుడి మృతి మాత్రమే కాదని, దళిత సమాజంపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం భారీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, జుట్టు కొండా సత్యనారాయణ,కొప్పుల నరసింహారెడ్డి, మురళీధర్ రెడ్డి, వంగవీటి శ్రీనివాస్,బండారు కవిత రెడ్డి, అంజి యాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల వెంకటరామయ్య,నూనె సులోచన, యదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News