రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
రైతులు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం; మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
Bandi Kiran Kumar
రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. గురువారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులకు మోసపోకుండాప్రతి గ్రామంలో ఐజేపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యనీకి క్విoటకు500 రూపాయలు బోనస్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రైతులు కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఐకెపి నిర్వాకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ, సొసైటీ సీఈవో యాదగిరి, మహేష్ , పాలుక వర్గ సభ్యులు నాయకులు రైతులు,పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి