రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు తప్పవు: మాజీ మంత్రి కేటీఆర్
రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు తప్పవు: మాజీ మంత్రి కేటీఆర్
Krishna
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శనగ పంటను కొనుగోలు కేంద్రానికి తెచ్చి నెలరోజులు గడిచినా ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేశారని, రైతు భరోసా సక్రమంగా అందడం లేదన్నారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వడదెబ్బలు, పిడుగులు, గుండెపోటులతో రైతులు మృతిచెందుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలుస్తామని, అవసరమైతే అధికార కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి