Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:52 AM

రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి

రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి

రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి
February 26, 2026 06:52 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పదకొండు అంకెల సంఖ్యతోనే పథకాల లబ్ధి – గాంధీనగర్ వ్యవసాయ సహాయ అధికారి స్వాతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భూభారతి ద్వారంలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ నమోదు చేసుకోవాలని గాంధీనగర్ వ్యవసాయ సహాయ అధికారి స్వాతి తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 13వ వార్డు గాంధీనగర్‌లో ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూక్యా కౌసల్య, భూక్యా మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఫార్మర్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు పదకొండు అంకెల ప్రత్యేక సంఖ్య జారీ అవుతుందని, ఆ సంఖ్య ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వం అందించే అన్ని పథకాల లబ్ధి కలుగుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకం వర్తించాలన్నా ఫార్మర్ నమోదు తప్పనిసరి అని పేర్కొన్నారు. పంట నష్టం పరిహారం, పంట భద్రత తదితర ప్రయోజనాలకు కూడా ఈ నమోదు అవసరమని చెప్పారు. నమోదు కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం తీసుకుని రావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారని, మిగిలిన వారు కూడా వెంటనే నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చి రాములు, కస్పరాజు రమేష్, సతీష్, రషీద్, వార్డు అధికారి నరేష్, సల్మాన్, అశోక్, గంగరాజు, రవి, భాస్కర్, జానయ్య, ప్రభు, ఉప్పి, ఉపేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News