రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి
రైతులకు ఫార్మర్ నమోదు తప్పనిసరి
Biksham Goud
పదకొండు అంకెల సంఖ్యతోనే పథకాల లబ్ధి – గాంధీనగర్ వ్యవసాయ సహాయ అధికారి స్వాతి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భూభారతి ద్వారంలో భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ నమోదు చేసుకోవాలని గాంధీనగర్ వ్యవసాయ సహాయ అధికారి స్వాతి తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 13వ వార్డు గాంధీనగర్లో ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూక్యా కౌసల్య, భూక్యా మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఫార్మర్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు పదకొండు అంకెల ప్రత్యేక సంఖ్య జారీ అవుతుందని, ఆ సంఖ్య ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వం అందించే అన్ని పథకాల లబ్ధి కలుగుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకం వర్తించాలన్నా ఫార్మర్ నమోదు తప్పనిసరి అని పేర్కొన్నారు. పంట నష్టం పరిహారం, పంట భద్రత తదితర ప్రయోజనాలకు కూడా ఈ నమోదు అవసరమని చెప్పారు. నమోదు కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం తీసుకుని రావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారని, మిగిలిన వారు కూడా వెంటనే నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చి రాములు, కస్పరాజు రమేష్, సతీష్, రషీద్, వార్డు అధికారి నరేష్, సల్మాన్, అశోక్, గంగరాజు, రవి, భాస్కర్, జానయ్య, ప్రభు, ఉప్పి, ఉపేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి