Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:06 AM

రైతుల సంక్షేమ ప్రభుత్వ ద్వేయం ; ఎమ్మెల్యే సామెల్

రైతుల సంక్షేమ ప్రభుత్వ ద్వేయం ; ఎమ్మెల్యే సామెల్

రైతుల సంక్షేమ ప్రభుత్వ ద్వేయం ; ఎమ్మెల్యే సామెల్
April 07, 2026 07:26 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్వేయమని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు సొసైటీ సహకార సంఘంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతoగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రైతులు చమటోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వరి ధాన్యం కింటాకు ఏ గ్రేడు 2389, బి గ్రేడ్ కింటాకు 2369 దర కల్పిస్తుందని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని సన్న రకం వడ్లకు కింటాకు 500 రూపాయల బోనసు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రైతులు దలార్లకు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏ రమేష్ బాబు, సొసైటీ సీఈవో యాదగిరి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బి కోచ్, కలకట్ల మల్లేష్, నాయకులు రేగటి రవి, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News