రైతుల సంక్షేమ ప్రభుత్వ ద్వేయం ; ఎమ్మెల్యే సామెల్
రైతుల సంక్షేమ ప్రభుత్వ ద్వేయం ; ఎమ్మెల్యే సామెల్
Bandi Kiran Kumar
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్వేయమని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు సొసైటీ సహకార సంఘంలో నిర్వహించిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతoగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రైతులు చమటోర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వరి ధాన్యం కింటాకు ఏ గ్రేడు 2389, బి గ్రేడ్ కింటాకు 2369 దర కల్పిస్తుందని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని సన్న రకం వడ్లకు కింటాకు 500 రూపాయల బోనసు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రైతులు దలార్లకు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏ రమేష్ బాబు, సొసైటీ సీఈవో యాదగిరి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బి కోచ్, కలకట్ల మల్లేష్, నాయకులు రేగటి రవి, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి