Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిఎసిఎస్ చైర్మన్ గా రాంరెడ్డి పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 08:01 PM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి
May 06, 2026 06:54 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ శివారులో గల రైతు వేదికలో జుక్కల్ క్లస్టర్ పరిధిలో మే 04 నుండి మే 09 వరకు నిర్వహించనున్న రైతు వారోత్సవాలను ఘనంగా ప్రారంభించిన ఆయన, ఈ సందర్భంగా నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన సదస్సు”లో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రవేత్తల సూచనలు పాటించి ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి సాగు మెళకువలు, తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించడం శుభపరిణామమని కొనియాడారు.విత్తనం నుండి విక్రయం వరకు ప్రభుత్వం రైతులకు వెన్నంటి ఉంటుందని, రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాయిల్ టెస్ట్ ల్యాబ్ మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు, యాంత్రీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వివరించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News