రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి
Krishna
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని జుక్కల్ శివారులో గల రైతు వేదికలో జుక్కల్ క్లస్టర్ పరిధిలో మే 04 నుండి మే 09 వరకు నిర్వహించనున్న రైతు వారోత్సవాలను ఘనంగా ప్రారంభించిన ఆయన, ఈ సందర్భంగా నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన సదస్సు”లో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రవేత్తల సూచనలు పాటించి ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి సాగు మెళకువలు, తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించడం శుభపరిణామమని కొనియాడారు.విత్తనం నుండి విక్రయం వరకు ప్రభుత్వం రైతులకు వెన్నంటి ఉంటుందని, రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాయిల్ టెస్ట్ ల్యాబ్ మంజూరు అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు, యాంత్రీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు వివరించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి