రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి
రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి
Editor Desk
నల్లగొండ పట్టణంలో రైతు సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్లోనే ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు.
అలాగే పెండింగ్ బోనస్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని, ఫామాయిల్ ఫ్యాక్టరీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి