Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి

రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి

రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కిసాన్ మోర్చా వినతి
March 26, 2026 08:43 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలో రైతు సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్‌లోనే ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు.

అలాగే పెండింగ్ బోనస్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని, ఫామాయిల్ ఫ్యాక్టరీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News