Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:58 PM

రైతు కుటుంబానికి భారీ నష్టం.. కరెంట్ షాక్‌తో బర్రె మృతి

రైతు కుటుంబానికి భారీ నష్టం.. కరెంట్ షాక్‌తో బర్రె మృతి

రైతు కుటుంబానికి భారీ నష్టం.. కరెంట్ షాక్‌తో బర్రె మృతి
May 03, 2026 08:54 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అందోల్ మండలంలోని పోసానిపేట గ్రామంలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని మంజీరా నది అంచున ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ వద్ద విద్యుత్ లీకేజీ కారణంగా కరెంట్ షాక్ తగిలి నాయికోటి నగేష్‌కు చెందిన సుమారు రూ.80 వేల విలువైన బర్రె మృతి చెందింది. ప్రతిరోజులాగే బర్రెలను నీళ్లు తాగించేందుకు మంజీరా నది వద్దకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మూడు బర్రెలు నీటిలోకి దిగగా కరెంట్ వ్యాపించడంతో రెండు బర్రెలు బయటపడగా ఒకటి అక్కడికక్కడే మృతి చెందింది. పాలు అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్న నగేష్ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ గోపాల్, ఉపసర్పంచ్ రాములు, గ్రామ పెద్దలు, గ్రామ సెక్రటరీ బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన గ్రామంలో విషాద వాతావరణం నెలకొల్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News