రైతు కుటుంబానికి భారీ నష్టం.. కరెంట్ షాక్తో బర్రె మృతి
రైతు కుటుంబానికి భారీ నష్టం.. కరెంట్ షాక్తో బర్రె మృతి
Krishna
అందోల్ మండలంలోని పోసానిపేట గ్రామంలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని మంజీరా నది అంచున ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ వద్ద విద్యుత్ లీకేజీ కారణంగా కరెంట్ షాక్ తగిలి నాయికోటి నగేష్కు చెందిన సుమారు రూ.80 వేల విలువైన బర్రె మృతి చెందింది. ప్రతిరోజులాగే బర్రెలను నీళ్లు తాగించేందుకు మంజీరా నది వద్దకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మూడు బర్రెలు నీటిలోకి దిగగా కరెంట్ వ్యాపించడంతో రెండు బర్రెలు బయటపడగా ఒకటి అక్కడికక్కడే మృతి చెందింది. పాలు అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్న నగేష్ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ గోపాల్, ఉపసర్పంచ్ రాములు, గ్రామ పెద్దలు, గ్రామ సెక్రటరీ బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన గ్రామంలో విషాద వాతావరణం నెలకొల్పింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి