Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:45 AM

రైతన్నకు భరోసా… చాట్రాయిలో గ్రామాలన్నింటికీ “రైతన్న మీకోసం” దూసుకెళ్తున్న కార్యక్రమం

రైతన్నకు భరోసా… చాట్రాయిలో గ్రామాలన్నింటికీ “రైతన్న మీకోసం” దూసుకెళ్తున్న కార్యక్రమం

రైతన్నకు భరోసా… చాట్రాయిలో గ్రామాలన్నింటికీ “రైతన్న మీకోసం” దూసుకెళ్తున్న కార్యక్రమం
March 18, 2026 06:13 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి, : రైతన్నను రాజుగా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం” కార్యక్రమం చాట్రాయి మండలంలో ఊపందుకుంది. గ్రామాలన్నింటికీ చేరువగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

వ్యవసాయం కేవలం జీవనాధారం కాకుండా లాభదాయకమైన గౌరవప్రదమైన రంగంగా మారాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)లో వ్యవసాయ రంగం సుమారు 35 శాతం వాటాతో కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు.

“స్వర్ణాంధ్ర 2047” లక్ష్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతి ఏడాది కనీసం 15 శాతం వృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఐదు ప్రధాన దిశల్లో కార్యాచరణ అమలు చేస్తోంది. సాగునీటి వనరుల విస్తరణ, భూగర్భ జలాల సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహంతో నీటి భద్రత కల్పించడం… దేశ, విదేశాల్లో డిమాండ్ ఉన్న కొబ్బరి, కాఫీ, కోకో, ఆయిల్ పామ్ పంటల సాగుకు ప్రోత్సాహం… అగ్రిటెక్ ద్వారా రైతు ముంగిట డిజిటల్ సేవలు, చీడపీడలను గుర్తించే AI యాప్స్ వినియోగం… ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఉత్పత్తులకు విలువ జోడించడం… ఇలా పలు దిశల్లో చర్యలు వేగవంతం చేశారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కే. హబీబ్ భాష రైతులతో నేరుగా మాట్లాడి పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది గ్రామాల వారీగా తిరిగి “రైతన్న మీకోసం” కరపత్రాలను రైతుల ఇళ్ల వద్ద అందజేశారు.

మండల వ్యవసాయ అధికారి బి.శివశంకర్ మాట్లాడుతూ, “రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. రైతన్నలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News