Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 23, 2026 02:53 PM

‘రైతన్న మీకోసం’లో రైతులకు పథకాలు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

‘రైతన్న మీకోసం’లో రైతులకు పథకాలు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

‘రైతన్న మీకోసం’లో రైతులకు పథకాలు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు
March 23, 2026 11:20 AM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలోని సాదాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలను రైతులకు వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే రాయితీపై విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సరఫరా విధానాలపై సమగ్ర సమాచారం అందించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శారదా భాయ్, రంగస్వామి నాయుడు, ఎల్‌ఎల్‌సి చైర్మన్ రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, రంగన్న, జిందే శంకర్, బాబు నాయుడు, మాజీ కౌన్సిలర్ అంజి, అయ్యన్న, గిడ్డయ్య, జేసీ బంగారయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News