Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:28 PM

రబీ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరపాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

రబీ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరపాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

రబీ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరపాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 24, 2026 06:28 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం మినీ మీటింగ్ హాల్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కేంద్రాలకు వచ్చే ధాన్యం అదే రోజున కొనుగోలు చేసి, వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిల్లర్లు కూడా లోడింగ్ అయిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా స్వీకరించాలని స్పష్టం చేశారు.

అలాగే ప్రతి కొనుగోలు కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ధాన్యం నిల్వకు అవసరమైన టార్పాలిన్లు, తూర్పార పట్టే యంత్రాలు, గన్నీ సంచులు, వెయింగ్ మెషీన్లు వంటి పరికరాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం రవాణా కోసం తగిన సంఖ్యలో లారీలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ అధికారి రమణ రెడ్డి, జిల్లా తూనిక కొలతల అధికారి వెంకటేష్, జిల్లా కోఆపరేటివ్ అధికారి మురళి, మిల్లర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News