రాష్ట్ర స్థాయి శాస్త్ర ప్రదర్శనకు హాజరైన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
రాష్ట్ర స్థాయి శాస్త్ర ప్రదర్శనకు హాజరైన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన
ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ - మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ అవార్డు కార్యక్రమం మరియు రాష్ట్ర స్థాయి బాల్ వైజ్ఞానిక ప్రదర్శన కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ పాల్గొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, నవీన ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలను ఎంపీ పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. విద్యారంగంలో ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రేరణనిచ్చి, భవిష్యత్ శాస్త్రవేత్తల తయారీలో కీలకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి