ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పలాభిషేకం చేసిన వంగపల్లి గ్రామ రైతులు
స్థానికం: భువనరిగిరి ప్రతినిధి నల్లమసు కుమార్
యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకు సంవత్సరానికి రూ.6,000గా అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ఇకనుంచి రూ.10,000లకు పెంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా వంగపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దొంత భరత్ మాట్లాడుతూ,రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని,కిసాన్ సమ్మాన్ నిధి పెంపు రైతులకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌటి పోచయ్య,సీసా వెంకటేష్,కాను నరసింహ గౌడ్,తాటిపాముల వెంకటేష్,పెరుమల్ల బిక్షపతి,నమిల వెంకటేష్,భువనగిరి కుమార్,పోషాలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి